ఒకవైపు ఆరా.. మరోవైపు భరోసా
Published: Thursday March 18, 2021
మంచిర్యాల టౌన్, మార్చి17, ప్రజాపాలన: నస్పూర్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో "నమస్తే మంచిర్యాల" కార్యక్రమంలో భాగంగా నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, టీఆర్ఎస్ యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ మండల అధ్యక్షులు వంగ తిరుపతి 17వ వార్డులో ఇంటింటికీ వెళ్లి టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరుని, స్థానిక ఎం.ఎల్.ఏ నడిపెల్లి దివాకర్ రావు నాయకత్వం లో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రతి ఇంటికి తిరుగుతూ అడిగి తెలుసుకోవడం జరిగింది.. ఈ క్రమంలో భాగంగా ఇటీవల మృతి చెందిన పత్తి నరసయ్య కుటుంబాన్ని పరామర్శించారు యువనేత విజిత్, ఈ సందర్భంగా మీకు మీ కుటుంబానికి ఏ సమస్య వచ్చిన అండగా నేనున్నానంటూ నరసయ్య భార్య పత్తి రాజేశ్వరి కి ఆర్థిక సాయమందించి భరోసానిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు టి ఆర్ యస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Share this on your social network: