ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం
Published: Thursday June 10, 2021
జన్నారం, జూన్ 9, ప్రజాపాలన ప్రతినిధి : ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చే ఐదు కిలోల బియ్యం అదనంగా మరో 5 కిలోల బియ్యాన్ని కలిపి మొత్తం పది కిలో బియ్యాన్ని దీపావళి వరకు ఉచితంగానే ఇవ్వాలని నిర్ణయించింది అందులకు బుధవారం ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందని బిజెపి మండల అధ్యక్షులు గోలి చందు తెలిపారు పేదవారికి ఉచితంగా కిలోల బియ్యాన్ని పంపిణీ చేయడం పట్ల సంతోషిస్తున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ బూరగడ్డ జగన్ బత్తిని నాగన్న గంగాధర్ తదితరులు పాల్గొన్నారు..
Share this on your social network: