ప్రభుత్వ వైద్యాధికారిని సన్మానించిన పూర్ణ యువసేన సభ్యులు
Published: Wednesday February 15, 2023
జన్నారం, ఫిబ్రవరి 14, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలానికి నూతనంగా నియామకం అయిన వైద్యఅధికారి డాక్టర్ ఉమాను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలిసి శాలువాతో పూర్ణ యువసేన సభ్యులు ఘనంగా సన్మానించారు. మంగళవారం మంచిర్యాల జిల్లా బంజారా సంఘ నాయకులు బాదవత్ శ్రీనివాస్ నాయక్, మండల ప్రజలకు మెరుగైన సేవలు అందించి మండల ప్రజల మెప్పు పొందాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు లాకవత్ సక్రు నాయక్, విజయ్ డాక్టర్ నారాయణ, స్టాఫ్ నర్సులు, ఆస్పత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: