మాతృమూర్తి జ్ఞాపకార్థంగా శాంతి నిలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన చల్లా శ్రీనివాస శర్

Published: Saturday December 18, 2021
బోనకల్, డిసెంబర్ 17 ప్రజాపాలన ప్రతినిధి: బోనకల్ మండల కేంద్రంలోని చల్లా శ్రీనివాస శర్మ తల్లి చల్లా కనకదుర్గాంబ జ్ఞాపకార్థంగా శుక్రవారం స్థానిక శాంతి నిలయం లోని అంగవైకల్య బాలికలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ భూక్యా సైదా నాయక్ మరియు బోనకల్ ఎంపీటీసీ, మండల ఉపాధ్యక్షులు గుగులోతు రమేష్ మాట్లాడుతూ శాంతి నిలయం లో ఉన్న అంగవైకల్య వికలాంగ బాలికలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం ఆన్నారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన చల్లా శ్రీనివాస శర్మకు సర్పంచ్ మరియు ఎంపీటీసీ అభినందనలు తెలిపారు. ఇంట్లో ఏదైనా కార్యక్రమం ఉంటే శాంతి నిలయాన్ని గుర్తించుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో చల్లా శ్రీనివాస శర్మ కుటుంబసభ్యులు రామశేష శర్మ, రవితేజ, కృష్ణ తేజ, పంచాయతీ కార్యదర్శి దామళ్ళ కిరణ్, శాంతి నిలయం నిర్వాహకురాలు సిస్టర్ ఆల్ పి మేడం తదితరులు పాల్గొన్నారు.