వైయస్సార్ తెలంగాణ పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి

Published: Monday October 11, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 10, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం లో వైయస్సార్ తెలంగాణ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అధితిగా వైయస్సార్ తెలంగాణ పార్టీ భువనగిరి పార్లమెంట్ కన్వీనర్ ఇరుగు సునీల్ కుమార్ హాజరు అయ్యారు. మొట్ట మొదటి సారి ఇబ్రహీంపట్నం నియోజకవర్గనికి విచ్చేసిన పార్లమెంట్ కన్వీనర్ ఇరుగు సునీల్ కుమార్ ను రాష్ట్ర కార్యవర్గ సభ్యులను నియోజకవర్గం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ కన్వీనర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కలిసి కట్టుగా ఉంటూ ప్రతి గ్రామంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ జెండాలు ఎగురవేయాలని, పార్టీ బలోపేతం కోసం పని చేయాలి అన్నారు. గ్రామాల్లో ప్రజలతో మమేకం అయ్యి ప్రజా సమస్యలపై వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం పై పోరాటం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొలుగురి అమృత సాగర్, మాదగోని జంగయ్య గౌడ్, పి.రవి, వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు కేసరి సాగర్, పోకల్ కార్ హరి నారాయణ జీ, యండి ఖలేద్, పంది జయరాజ్, నేనవత్ శ్రీనివాస్ నాయక్, ఉడుగుల బాస్కర్ గౌడ్, గోరెంకాల నందకుమార్ ముదిరాజ్, దూసరి వేణు ప్రసాద్ గౌడ్, తాళ్ల అఖిలేష్ గౌడ్, యండి ముస్థాఫ, కొమ్ము సుధాకర్, బత్తుల విక్రమ్, కొండ్రు తరుణ్, బూడిద మహేందర్, బ్ ముఖేష్ గౌడ్,  తదితరులు పాల్గొన్నారు.