శ్రీకాంత్ చారి విగ్రహం ఏర్పాటు చేయాలి

Published: Thursday November 24, 2022
జన్నారం, నవంబర్ 23, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఖానాపూర్  ఎమ్మెల్యే అజ్మీర రేఖనాయక్ ను మండల కేంద్రంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగిందని,  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంలిదశ ఉద్యమంలో తెలంగాణ కొరకు పోరాడి మొట్టమొదటగా ఆత్మ బలిదానం చేసుకొని అమరుడైనటువంటి కాసోజు శ్రీకాంతాచారి విగ్రహం జన్నారం మండల కేంద్రంలో పెట్టులని మాట్లాడడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దానికి ఎమ్మెల్యే గారు స్పందించి విగ్రహాన్ని ఏర్పాటు చేయుటకు సహకారాన్ని అందిస్తానని హమీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు శ్రీపాదం రమేష్, ప్రధాన కార్యదర్శి వెయ్యి కండ్ల రవి, కోశాధికారి శివనూరి శ్రీనివాస్, యూత్ సభ్యులు నూతి సంతోష్ కుమార్, పొనకంటి శ్రీనివాస్, కొత్తపెళ్లి రాజు, పొనకంటి సతీష్, పలజి రమేష్, శ్రీ పాదం రాకేష్, మండల విశ్వబ్రాహ్మణులు పాల్గొన్నారు.