శివ శంభో శంకర ఓం నమశివాయ అంటూ రెండో కాశీగా పిలవబడుతున్న శివాలయంలో పెద్ద ఎత్తున తరలివచ్చినభక

Published: Tuesday November 15, 2022

మధిర రూరల్ నవంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు రెండో కాశీగా పిలవబడుతున్న శివాలయంలో మూడోవారం కావడంతో పెద్ద ఎత్తున శివ భక్తులు పాల్గొని కార్తీక సోమవారం కావడంతో భక్తులు వెలిగించిన కార్తీక దీపాలతో కడు రమణీయంగా మధిర శివాలయం.శివనామ స్మరణతో మారుమోగుతున్న మధిర శివాలయం.భక్తులు దంపతులుగా వచ్చి శివాలయ ప్రాంగణంలో ఈ తెల్లవారుజాము నుంచి భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు.భక్తులు ముఖ్యంగా అయ్యప్ప భక్తులు, మహిళా భక్తుల శైవ నామస్మరణతో దద్దరిల్లిన మధిర శివాలయం.భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మధిర శివాలయం చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు ఆలయంలో పటిష్ట చర్యలు తీసుకొన్నారు. అనంతరంం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలో శివాలయం సిబ్బంది అర్చకులుుు పాల్గొన్నారుభక్తుల పూజలు, దైవదర్శనం అనంతరం పూజారులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.