డీఈఓ ఆకస్మిక తనిఖీ

Published: Thursday December 09, 2021
యాదాద్రి డిసెంబర్ 8 వలిగొండ ప్రజాపాలన ప్రతినిది మండల పరిధిలోని పట్టణ కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి కానుగుల నరసింహ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు పరిశీలించి తగు సూచనలు చేయడం జరిగింది. 10వ తరగతి విద్యార్థులతో పాఠం చదివించి ఎస్ ఏ పరీక్షలకు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.ఇటీవల వారధి ఫౌండేషన్ వారు నిర్వహించి వ్యక్తిత్వ పోటీలో రాష్ట్ర స్థాయిలో 2వ బహుమతి సాధించిన 9వ తరగతి విద్యార్థిని కె సిరి ని అభినందించారు. పాఠశాల నిర్వహణపై సంతృప్తి తెలిపారు.