పట్టణ అభివృద్ధే లక్ష్యంగా కృషి: మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్

Published: Thursday February 11, 2021
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 10 ( ప్రజాపాలన ) : మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డును అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్ అన్నారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని 22వ వార్డు కౌన్సిలర్ సుధాంష్ కిరణ్ పటేల్ ఆధ్వర్యంలో సిసి రోడ్ల నిర్మాణం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి వార్డులోని అంతర్గత రోడ్లను సిసి రోడ్లుగా నిర్మాణం చేస్తున్నామని వివరించారు. అందులో భాగంగా బుధవారం 22వ వార్డులో 5 లక్షల బడ్జెట్ తో సిసి రోడ్డు నిర్మాణానికి పూజా కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. వార్డులో ఏ సమస్యలు ఉన్నా వెంటనే నా దృష్టికి తెవాలని సూచించారు. వార్డు సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు   అనంత్ రెడ్డి, కృష్ణా రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు సురేష్ గౌడ్, జైపాల్ రెడ్డి, నర్సింహా రెడ్డి , బోరెడ్డి చంద్రా రెడ్డి, వార్డు ప్రజలు పాల్గొన్నారు. 
 
Attachments area