డ్రైనేజ్ పనులను ప్రారంభించిన కార్పొరేటర్

Published: Friday May 07, 2021
మేడిపల్లి, మే6 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధి 11వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మద్ది యుగేందర్ రెడ్డి 5 లక్షల మున్సిపల్ నిధులతో డ్రైనేజ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మద్ది యుగేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ డివిజన్లో చాలా కాలం నుండి డ్రైనేజీ సమస్యలు ఉన్నందున మున్సిపల్ నిధులను మంజూరు చేయించి పనులను ప్రారంభించామని తెలిపారు. డివిజన్లోని మంచినీళ్లు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేేష్, మల్లారెడ్డి గాలయ్య మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.