ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Published: Monday June 07, 2021

బెల్లంపల్లి, జూన్ 6, ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తలకు ఆదివారం నాడు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కరోనా కష్టకాలంలో గ్రామాల్లో అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరోనా వ్యాప్తి చెందకుండా ఆశాకార్యకర్తలు చేసిన సేవలు వెలకట్టలేనివని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రణయ్ గారు, జడ్పీటీసీ బాణయ్య గారు, మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు, టి ఆర్ ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.