ఇళ్ల స్థలాలు కేటాయించాలి చేవెళ్ల (బ్యూరో) ప్రజాపాలన:

Published: Friday November 11, 2022

మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామంలో సర్వేనెంబర్ 218 లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా.........సిపిఎం చేవెళ్ల డివిజన్ ఇంచార్జ్ అల్లి దేవేందర్  మాట్లాడుతూ.........సర్వే నెంబర్ 218, 121 గజం చొప్పున చాలా మంది పేదవాళ్లకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని కొంత మంది ఇల్లు కూడా కట్టు కున్నారని కట్టుకున్న ఇళ్లను ఎందుకు తొలగించారని ఇళ్ల పట్టాలు ఉన్న వారిని అక్కడ ఇల్లు ఎందుకు కట్టు కోనివ్వడం లేదని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు.అప్పటి ప్రభుత్వం ఇచ్చిన పట్టాలకు విలువ లేదా అని ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం స్పందించి ఇళ్ల పట్టాలు ఉన్నటు వంటి వాళ్ళందరికీ జాగాలు చూపించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఇక్కడ గుడిసెల పోరాటం  ప్రారంభిస్తామని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు అరుణ్ కుమార్,శ్రీనివాస్,సిపిఎం నాయకులు మల్లేష్,రాములు, గోపాల్,యాదయ్య,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.