కరోనా బాధితులలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ

Published: Tuesday May 18, 2021
కోరుట్ల, మే17, (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా బాధితులలో పేదవారికి నిత్యావసరవస్తువుల సహాయార్థం దాతలు ముందుకు వచ్చి సహాయం చేయవలసిందిగా కోరుట్ల బీజెపి పట్టణ శాఖ ఇచ్చిన పిలుపు మేరకు స్పందించిన పాలెపు కార్తీక్ భరద్వాజశర్మ కోరుట్లలో కరోనాతో బాధపడుతున్న పేద కుటుంబాలు గడ్డం అనురాధ, కండ్లెపు నర్సవ్వ (మున్సిపల్ కార్మికురాలు) మరియు దూడపాక వెంకటలక్ష్మి కుటుంబాలకు ఒక్కొక్కరికి 25కి. బియ్యం, 1కి.నూనె ప్యాకెట్, 1కి.కందిపప్పు మరియు వారంరోజులకు సరిపడా కూరగాయలను వారి వారి ఇంటివద్దకు తీసుకెళ్లి ఇవ్వడం జరిగింది. వారికే కాకుండా ఇంకా అవసరం ఉన్న పేదవారికి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు.ఈ సందర్భంగా  కార్తీక్ భరద్వాజ శర్మ కి కోరుట్ల బిజెపి పట్టణ శాఖ తరపున ధన్యవాదములు తెలియజేస్తూ, ఇంకా ప్రజలు కూడా పేదవారిలో అవసరం అన్నార్థులకు చేతనైన సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు చిరుమల్ల ధనంజయ్, సేవాహీ సంఘటన్ కోరుట్ల కన్వీనర్ సుదావేని మహేష్, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాడవేని నరేష్, బీజేపీ ప్రధాన కార్యదర్శి పోతుగంటి శ్రీనివాస్, ఆర్మూరీ వినోద్ పాల్గొన్నారు.