టిఆర్ఎస్ పార్టీ పటిష్ఠతే లక్ష్యం

Published: Friday August 20, 2021
తిమ్మాపూర్, కుడుగుంట, పెద్దాపూర్లలో గ్రామ కమిటీల నియామకం
మర్పల్లి మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు నాదిరీగ శ్రీకాంత్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 19 ఆగస్ట్ ప్రజాపాలన : టిఆర్ఎస్ పార్టీ పటిష్ఠతే లక్ష్యంగా కృషి చేస్తున్నామని మర్పల్లి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాదిరీగ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్ నియోజకవర్గంలోని మర్పల్లి మండలానికి చెందిన తిమ్మాపూర్ కుడు గుంట పెద్దాపూర్ గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీలు నియమించారు. తిమ్మాపుర్ గ్రామ కమిటి అధ్యక్షునిగా మామిడి అశోక్, రైతు బంధు అద్యక్షురాలిగా జోగు అనిత, సొషల్ మీడియా కన్వీనర్ గా జోగు రాజు. కుడుగుంట గ్రామ కమిటి పార్టీ అద్యక్షునిగా జి.అంజయ్య, రైతు బంధు అద్యక్షునిగా వీరేశం, సొషల్ మీడియా కన్వీనర్ గా బి.ప్రవీణ్. పెద్దపూర్ గ్రామ కమిటి అధ్యక్షునిగా మహమ్మద్ ఖాజా, రైతు బంధు అద్యక్షునిగా జర్నయ్య, రైతు బందు మండల కమిటి సభ్యునిగా మల్లయ్య, సొషల్ మీడియా కన్వీనర్ గా విష్ణువర్ధన్ రెడ్డిలను నియమించనైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు డి.అశోక్, పార్టీ ప్రధాన కార్యదర్శీ మధుకర్, మండల రైతు బందు అద్యక్షులు నాయబ్ గౌడ్, మండల సినియర్ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ అంజయ్య గౌడ్ పిఏసిఎస్ డైరక్టర్ యాదయ్య సర్పంచులు ఉమారాణి గోపాల్ రెడ్డి శేఖర్ మండల సొషల్ మీడియా కన్వినర్ వికాస్ నాయకులు అలీమొద్ది శ్రీనివాస్ రెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.