నేడు మండలంలో భట్టి విక్రమార్క పర్యటన

Published: Thursday November 10, 2022
బోనకల్,నవంబర్ 10 ప్రజా పాలన ప్రతినిధి: మండలంలో  తెలంగాణా కాంగ్రెస్ పక్షనేత,మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క  గురువారం మండలంలోని పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు తెలిపారు.ఉదయం పది గంటలకు కలకోట నుంచి నారాయణపురం బీటీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ పర్యటనలో మండల,గ్రామ, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,శ్రేణులు,అనుబంధ కమిటీ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.