కౌశిక్ రెడ్డి స్థాయి మరిచి మాట్లాడకు : టీపీసీసీ నాయకులు జువ్వాడి కృష్ణారావు

Published: Wednesday July 14, 2021
మెట్ పల్లి, జూలై 13 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డిని  హుజురాబాద్ కు చెందిన పాడి కౌశిక్ రెడ్డి విమర్శించడం సహించరాని విషయం అని తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. మంగళవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గత ముందస్తు శాసనసభ ఎన్నికల్లో హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకపోతే కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చి గుర్తింపు ఇచ్చినది అని, కానీ ఇప్పుడు టీఆరెఎస్ నాయకులకు తొత్తుగా మారి కేసీఆర్, కేటీఆర్ లు ఇచ్చే డబ్బులకు అమ్ముడు పోయిన వ్యక్తి అని విమర్శించారు. అలాంటి కోవర్ట్ కౌశిక్ రెడ్డి పోరాటయోధుడు అయిన రేవంత్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదని, ముందు కౌశిక్ రెడ్డి తన స్థాయి ఏమిటో తెలుసు కోవాలని కృష్ణారావు అన్నారు. పాడి కౌశిక్ రెడ్డి కోవర్ట్ కౌశిక్ అయ్యాడని కృష్ణారావు విమర్శించారు. ఇలాంటి విమర్శలు మానుకోవాలని అన్నారు.