కరోనా బాధిత కుటుంబానికి భీమా చెక్కు అందజేత జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్
Published: Friday July 22, 2022
ఆసిఫాబాద్ జిల్లా జులై21(ప్రజాపాలన, ప్రతినిధి) : కరోనా సమయంలో వైరస్ కారణంగా మృతి చెందిన బాధిత కుటుంబానికి బీమా నగదు చెక్కు అందజేయడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ వాజ్పాయ్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సర్ఫ్ సి సి గా విధులు నిర్వహించిన లింగాపూర్ మండల సి సి మెస్రం కాశీరం గత సం రం, కరోనాతో మృతి చెందగా గురువారం కాశీరాం భార్యకమలకు శ్రీనిధి నుండి బీమా నగదు రూ 1 లక్ష 50 వేలు విలువగల చెక్కును అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ అభివృద్ధి అధికారి, సహాయ అధికారి, శ్రీనిధి ఆర్ఎం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: