సమ్మక్క జాతరకు ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Published: Monday February 14, 2022
బెల్లంపల్లి ఫిబ్రవరి 13 ప్రజాపాలన ప్రతినిధి : ఈ నెల 16 నుండి మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు బెల్లంపల్లి బస్ స్టాండ్ నుండి ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్ టి సి బస్ సర్వీస్ లను ఆదివారం నాడు ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ టి సి బస్సుల్లో ప్రయాణం చాలా సురక్షితమైనదని, భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని అమ్మ వార్లను దర్శించుకొని అమ్మవార్ల ఆశీసులు పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ టి సి ఆసిఫాబాద్ డిపో మేనేజర్, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ భత్తుల సుదర్శన్, కౌన్సిలర్లు మరియు కో ఆప్షన్ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, తెరాస నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: