సమ్మక్క జాతరకు ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Published: Monday February 14, 2022
బెల్లంపల్లి ఫిబ్రవరి 13 ప్రజాపాలన ప్రతినిధి : ఈ నెల 16 నుండి మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు బెల్లంపల్లి బస్ స్టాండ్ నుండి ఏర్పాటు చేసిన ప్రత్యేక  ఆర్ టి సి బస్ సర్వీస్ లను ఆదివారం నాడు ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ టి సి బస్సుల్లో ప్రయాణం చాలా సురక్షితమైనదని, భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని అమ్మ వార్లను దర్శించుకొని అమ్మవార్ల ఆశీసులు పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ టి సి ఆసిఫాబాద్ డిపో మేనేజర్, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ భత్తుల సుదర్శన్, కౌన్సిలర్లు మరియు కో ఆప్షన్ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, తెరాస నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.