గార్లపాడు లో సోను సూద్ విగ్రహా ఆవిష్కరణ

Published: Tuesday November 16, 2021
బోనకల్, నవంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని గార్ల పాడు గ్రామానికి చెందిన గుర్రం వెంకటేశ్వర్లు సోను సూద్ మీద ఉన్న అభిమానంతో విగ్రహ ఆవిష్కరణ చేయాలని అనుకున్నారు. సోను సూద్ కరోనా కష్ట కాలంలో విద్యార్థులకు ఉచిత టికెట్స్ ఇచ్చి స్వదేశాలకు తీసుకు రావటం, రైతుకు ట్రాక్టర్ ఇవ్వటం, కార్మికులను ఉచిత బస్ లు పెట్టీ స్వగ్రామం లకు పంపించటం అడిగిన ప్రతీ వారికి సహాయం చేయటం ప్రజలకు చేసినా సేవలు ప్రభుత్వాలు చేయలేని ఏన్నో కార్యక్రమాలు సోను సూద్ చేశారనీ, అందువలన సోను సూద్ విగ్రహా ఆవిష్కరణ చేయాలనే ఆలోచన వచ్చిందని అనుకున్నదే తడువుగా తన దగ్గర ఉన్న కొంత మొత్తాన్ని వెచ్చించి విగ్రహం చేయించానని విలేకరుల తో గుర్రం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలియ చేశారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరణ ను బోనకల్ వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గార్ల పాడు ఎంపీటీసీ ముక్కపాటి అప్పారావు, తాత గోపయ్య, కొచ్చేర్ల కృష్ణా బోనకల్ మండల బీజేపీ యువ నేత బిపి నాయక్, కట్లా రాజయ్య దురిశాల సత్యం ,కనకపుడి బూసి, దారెల్లి జయరాజు, సిలవరజు, తీరుమలి, రామస్వామి, బాలు, వంశీ, అక్కమ్మ, కె నాగరాజు, ఏసుపోగు, అశోక్ మోదుగు. ప్రవీణ్ మరియు తదితరులు పాల్గొన్నారు.