కోర్టు సమస్యలు పరిష్కరించాలని హైకోర్టు జడ్జికి వినతి.
Published: Thursday May 19, 2022
లక్షెటిపేట, మే18, ప్రజా పాలన ప్రతినిధి:
అడీషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ లక్షెటిపేట కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోర్ట్ పోలియో జడ్జి హైకోర్టు జడ్జి విజయ్ సేన్ రెడ్డి కి హైకోర్టులో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కోర్టులో మౌలిక వసతుల ఏర్పాటుతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని జడ్జికి విన్నవించారు. అంతకు ముందు జడ్జికి న్యాయవాదులు పుష్ప గుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్షెటిపేట కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడికొప్పుల కిరణ్ ఉపాధ్యక్షుడు గాండ్ల సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి ఎస్.ప్రదీప్ కుమార్ న్యాయవాదులు ఈ.రాజేశ్వరరావు కేతిరెడ్డి భూమరెడ్డి గూడూరు గోవిందరావు అక్కల శ్రీధర్ వేల్పుల సత్యం రెడ్డిమల్ల ప్రకాశం తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: