ఘనంగా టైలర్స్ డే ఆవిర్భవ దినోత్సవం

Published: Monday March 01, 2021
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, ఫిబ్రవరి 28, ప్రజాపాలన; పట్టణంలో భగత్ సింగ్ సెంటర్ సమీపాన, ఆదివారం నాడు టైలర్స్ డే దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట పట్టణ  టైలర్స్ యూనియన్ అధ్యక్షులు, తాడేపల్లి సిద్దు, సెక్రటరీ నాళ్ల సత్యనారాయణ, గౌరవ అధ్యక్ష కమిటీ వారు మాట్లాడుతూ, అశ్వరావుపేట పట్టణంలో గత పది పదిహేను సంవత్సరాల నుంచి, టైలర్స్ కుటుంబీకులకు, టైలర్స్ కాలనీ ఏర్పాటు చేసి, టైలర్ కుటుంబాలకు ఇల్లు నిర్మించాలని, ఎన్నో సార్లు ప్రభుత్వాలకు, విన్నవించిన కార్యరూపం దాల్చలేదని వాపోయారు. తక్షణమే ప్రభుత్వం టైలర్ వృత్తి కుటుంబాలను ఆదుకోవాలని, అశ్వారావుపేట పట్టణం లో టైలర్స్ కాలనీ ఏర్పాటు చేసి ఇల్లు నిర్మించాలని, ప్రభుత్వాల ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు టైలర్ కుటుంబాలకు వర్తింపజేయాలని కోరినారు. టైలర్స్ డే, సందర్భంగా పట్టణంలోని అమ్మ సేవ వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా  యు ఎస్ ప్రకాష్ రావు, పట్టణ టైలర్స్ అధ్యక్షులు తాడేపల్లి సిద్ధూ, గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ, సెక్రటరీ నాళ్ళ సత్యనారాయణ, కొనాకళ్ల శ్రీను, సహాయ కార్యదర్శి పి అప్పారావు ట్రైజరరీ నాగరాజు, కమిటీ సభ్యులు సర్వేశ్వరరావు స్వప్న మౌలాలి, వేముల భగవన్నారాయణ సాంబశివరావు మెహబూబ్ బి, తదితరులు పాల్గొన్నారు