సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

Published: Saturday August 27, 2022
మధిర రూరల్ ఆగస్టు 26 ప్రజాపాలన ప్రతినిధి మండలంలోని శుక్రవారం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో పలువురికి సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను శుక్రవారం మండల కాంగ్రెస్ కార్యాలయంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్  చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధిర మున్సిపాలిటీ పరిధిలోని ఇల్లందలపాడు గ్రామానికి చెందిన నండ్రు బ్రహ్మాజీ కి  19 వేల ఐదు వందల రూపాయలు మంజూరు అయినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ లీడర్, మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క   సిఫార్సుతో వారికి సీఎం రిలీఫ్ ఫండ్  చెక్కులు మంజూరైనట్లు వారు తెలిపారు. నియోజకవర్గ ప్రజల కష్ట కాలంలో భట్టి విక్రమార్క నిరంతరం అండగా ఉంటూ ఆపదలో ఉన్న అనేక మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందజేసినట్లు వారు పేర్కొన్నారు. భట్టి విక్రమార్క నిరంతరం కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా రని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చావా వేణు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ధారా బాలరాజు పట్టణ మైనార్టీ అధ్యక్షుడు షేక్ జహంగీర్ కోట డేవిడ్ సామినేని నాదం తదితరులు పాల్గొన్నారు.