సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

Published: Thursday May 27, 2021
భట్టి విక్రమార్క చొరవతో సీఎం సహాయ నిధి చెక్కులు మంజూరు
 మధిర ప్రజాపాలన ప్రతినిధి : 26వ తేదీ మధిర మండలంలోని మర్లపాడు, వంగవీడు, అంబరుపేట గ్రామాల లోని పలువురు అనారోగ్యంతో బాధపడుతూ వివిధ హాస్పిటల్స్ నందు చికిత్స పొందిన అనంతరం అక్కడ అయిన ఖర్చును తమ కుటుంబ ఆర్దిక పరిస్థితులు దృష్ట్యా సీఎం సహాయ నిధి నుండి ఆర్దిక సహాయం అందించాలని కోరుతూ. మధిర శ్యాసన సభ్యులు మల్లుభట్టి విక్రమార్క ద్వారా దరఖాస్తు చేసుకోగా మల్లుభట్టి విక్రమార్క గారి సిఫార్సు మేరకు పలువురికి సీఎం సహాయ నిధి నుండి చెక్కులు మంజూరు అయ్యాయి. కాగా అట్టి చెక్కులను ఈ రోజు మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూరం శెట్టి కిశోర్ గారిచేతుల మీదుగా అందించటం జరిగింది, లబ్దిదారులకు వివరాలు. సత్యనారాయణ రెడ్డి మర్లపాడు. 18000, వెంకటేశ్వరరెడ్డి వంగవీడు 19500, దుర్గమ్మ అంబరుపేట. 16500 వారికి అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో మధిర మండల sc సెల్ అధ్యక్షులు దారా బాలరాజు, టౌన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జహంగీర్, కాంగ్రెస్ నాయకులు ముస్లిం వెల్ఫేయిర్ కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ అలీ, మైలవరపు చక్రి, మొదలగు వారు పాల్గొన్నారు.