డిసెంబర్ 3న సిఐటియు జిల్లా మహాసభను జయప్రదం చేయాలి ** సిఐటియు జిల్లా అధ్యక్షుడు లోకేష్ **

Published: Thursday November 24, 2022

ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 23 (ప్రజాపాలన,ప్రతినిధి) : డిసెంబర్ 3న సిఐటియు ప్రథమ మహాసభలను జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ లో జరుపుటకు నిర్ణయించడం జరిగిందని సిఐటియు జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్ అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మహాసభలకు జిల్లాలోని వివిధ రంగాల నుండి  అన్ని రంగాల సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు, ఆశ అంగన్వాడి, మధ్యాహ్న భోజనం, గ్రామ పంచాయితీ, హెల్ప్ డిపార్ట్మెంట్ సెంటర్, ఏఎన్ఎం, గ్రామ సేవకులు, ఐకెపి, ప్రభుత్వ రంగాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, ఆశ్రమ హాస్టల్ వర్కర్, హమాలీ కార్మికులు,ఆటో ట్రాలీ, తదితర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి సిఐటియు కెబీ జిల్లా ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించి  ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక హక్కుల సాధన కోసం, సిఐటియు చేసిన ఉద్యమాల్లో మీరంతా పాల్గొని విజయవంతం చేసుకోవడం జరిగిందన్నారు. భవిష్యత్తు ఉద్యమాలను నిర్మాణం చేయడం కోసం ఈ ప్రసన్న మహాసభలు వేదిక కానున్నాయన్నారు. కావున జిల్లా వ్యాప్తంగా కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేందర్, సిఐటియు జిల్లా కార్యదర్శి బాలకృష్ణ, కమలాకర్ మేస్త్రి, వెంకన్న, లు పాల్గొన్నారు.