పంచాయతీ పన్నులు వసూళ్లలో తప్పుడు రశీదులు

Published: Saturday June 11, 2022
జన్నారం రూరల్, జున్ 10, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం రోటిగూడ గ్రామపంచాయతీలో ఇంటిపన్ను వసూళ్లు కు సంబంధించిన  రశీదులు 2019- 
 20 సంవత్సరానికి గాను స్థానిక కార్యదర్శి కొత్తపెళ్లి పావని అవకతవకలు చేశారని లక్కాకుల సత్తయ్య అన్నారు. శుక్రవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు.  గ్రామ పంచాయతీ ఇంటి పన్ను విషయంలో ప్రజలకు ఇచ్చిన రసీదు లో డబ్బులు ఒక విధంగా ఇచ్చి గ్రామపంచాయతీ రికార్డులో తక్కువగా డబ్బులు చూపెట్టి దాదాపు లక్షా 50 వేల రూపాయలు కాచేశారని అయన ఆరోపించారు. సమాచార హక్కు చట్టం ప్రకారం ధరఖాస్తు చేయగా ఈ స్థానిక గ్రామ పంచాయతీ రోటిగూడ కార్యదర్శి చేసిన అవకతవకలు  జరిగినవి, ఈ రోటిగూడ గ్రామ పంచాయతీ అదికారి రశీదులు మండల ఎంపిడివో అరుణరాణి తెలియపరతడం జరిగిందని అయన అన్నారు.