రాయికల్ మండలంలోని మొక్కలు నాటిన ఎంపీపీ
Published: Thursday February 18, 2021
జగిత్యాల, ఫిబ్రవరి 17 (ప్రజాపాలన): రాయికల్ మండలంలో తాట్లవాయి ఆల్యానాయక్ తండ కట్కాపూర్ గ్రామాల్లో కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి కోటి వృక్షార్చనలో భాగంగా రాయికల్ మండల ఎంపీపీ లావుడ్యా సంధ్యారాణి సురేంధర్ నాయక్ మొక్కలు నాటారు. ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని 29 వ నూతన రాష్ట్రంగా సాధించి భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చి భారత దేశానికే దిక్సుచిల తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఇనుముల రమేష్ ఎంపీవో శ్రీనివాస్ ఆయా గ్రామాల సర్పంచులు రాగి సాగరిక శ్రీనివాస్ ముద్దసాని రాజమౌళి లావుడ్యా నందు ఉప సర్పంచులు సంతోష్ మల్లేష్ వార్డుమెంబర్లు ఆయా గ్రామాల కార్యదర్శిలు తెరాస గ్రామ నాయకులు అధ్యక్షులు యూత్ అధ్యక్షులు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: