27వ డివిజన్ లో రోడ్డు పనులు ప్రారంభం

Published: Friday April 23, 2021

బాలపూర్, ఏప్రిల్ 22, ప్రజాపాలన ప్రతినిధి : దశలవారీగా అభివృద్ధి పనులు జరుగుతాయని కార్పొరేషన్ మేయర్ పేర్కొన్నారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 27 వ డివిజన్ కార్పొరేటర్ తోట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో  హనుమాన్ దేవాలయం నుండి వెంకటేశ్వరా కాలనీ వరకు నూతనంగా వేస్తున్నటువంటి సిమెంట్ కాంక్రీట్ రోడ్డుని  కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... ప్రతి డివిజన్లో వివిధ కాలనీలో దశల వారీగా అభివృద్ధి పనులు జరుగుతాయని తెలిపారు., కార్పోరేటర్ తోట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.... కాలనీవాసులు అందరికీ కరోనా దరిదాపుల్లోకి రావొద్దని ఆలోచించే ప్రతి ఒక్కరు మాస్కులు పెట్టుకోవాలి, భౌతిక దూరం పాటించి శానిటేజ్న్ వాడుతూ జాగ్రత్తలు పాటించగలరు అని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు సిబ్బంది, కాలనీ వాసులు   తదితరులు పాల్గొన్నారు.