ఫిబ్రవరి 12 న మాదిగ విద్యార్థుల గర్జనను విజయవంతం చేయాలి

Published: Friday January 07, 2022

బీరుపూర్, జనవరి 06 (ప్రజాపాలన ప్రతినిధి): ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో బీజేపీ తీవ్ర నిర్లక్షానికి పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఫిబ్రవరి 12న ఛలో హైదరాబాద్ మాదిగ విద్యార్థుల గర్జన సభను విజయవంతం చేయడానికి గ్రామ గ్రామాన మాదిగ విద్యార్థులు సన్నద్దం కావాలని ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ విభాగాలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దుమాల గంగారాం మాదిగ జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ మాదిగ యువసేన మండల ఇన్చార్జి మోతే సుధాకర్ మాదిగ సుద్దాల తిరుపతి మోతె ప్రభాకర్ పూడూరి రమేష్ మోతె ముత్యం నర్సయ్య ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.