ఈ నెల 29 న ఎన్టీ రామారావు విగ్రహ ఆవిష్కరణ

Published: Wednesday March 24, 2021
పాలేరు (ప్రజాపాలన ప్రతినిధి) మార్చి 23 : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముట పురం గ్రామంలో కీర్తిశేషులు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి విగ్రహ ఆవిష్కరణ 29 మార్చి 2021 సోమవారం ఉదయం 11 గం. కు నందమూరి సుహాసిని, గారిచే ఆవిష్కరింప చేయనున్నారు ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కొత్తకోట దయాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి తాళ్లూరి జీవన్, డాక్టర్ రామనాథం, సీతా దయాకర్ రెడ్డి, నేలకొండపల్లి తెలుగుదేశం అధ్యక్ష కార్యదర్శులు. ఏ కొండలరావు, ఎన్ మల్లయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు