తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నాను జయప్రదం చేయండి

Published: Tuesday December 13, 2022

బోనకల్, డిసెంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి: ఈ నెల 14న సిపిఐ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కలకోట, రాయన్నపేట, మోటమర్రి గ్రామాల్లో సిపిఐ శ్రేణులు ప్రచార సమావేశాలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఇండ్ల స్థలాలు, రేషన్కార్డులు, ప్రజాసమస్యల పరిష్కారానికై సిపిఐ ప్రజాపోరాటాలు చేస్తుందన్నారు. పేదలందరికీ రేషన్కార్డులు, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇళ్లస్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్ధాంతరంగా ఆర్ఓబి బ్రిడ్జి కింద చిరు వ్యాపారాలు చేసుకునే వారిని ప్రత్యామ్నాయం చూపకుండా రోడ్డు పాలు చేశారన్నారు. అట్టివారికి ప్రభుత్వం స్థలాలను కేటాయించి ఆదుకోవాలని కోరారు. ఆర్ఓబి బ్రిడ్జి రహదారి కి మరమ్మతుడు చేయించి విద్యుత్ దీపాలను అమర్చాలన్నారు .రానున్న రోజుల్లో ప్రజాసమస్యల పరిష్కారానికి సిపిఐ పార్టీ ముందుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు పారుపల్లి రాఘవులు, పారుపల్లి నరసింహరావు, శాఖా కార్యదర్శి గుడిద కృష్ణ, రావులు వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.