అమితమైన భక్తికి, త్యాగానికి ప్రతీక బక్రీద్ : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Published: Thursday July 22, 2021
పటాన్చేరు, జులై 21, ప్రజాపాలన ప్రతినిధి : అమితమైన భక్తికి, త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకొని బుదవారం పటాన్చెరు పట్టణంలోని శాంతినగర్ కాలనీలో ఆధునీకరించిన మదీనా మసీదును సందర్శించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు ఎమ్మెల్యే తెలియజేశారు. పండుగ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని, సోదర భావాన్ని పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మసీదు కమిటీ ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.