అండర్ 16 క్రికెట్ పోటీలకు శ్రీనిధి స్కూల్ విద్యార్థి ఎంపిక
Published: Wednesday October 26, 2022
మధిర అక్టోబర్ 25 (ప్రజా పాలన ప్రతినిధి) ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నవంబర్ 16 నుంచి అండర్ 16 క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టు ఎంపికకు ఇటీవల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ఖమ్మం జిల్లా మధిరకు చెందిన శ్రీనిధి స్కూల్ విద్యార్థి పెరుమలపల్లి కిషన్ రాజు ఎంపికైనట్లు పాఠశాల అధినేత బి అంజన బాబు మంగళవారం విలేకరులకు తెలిపారు. కిషన్ రాజ్ శ్రీనిధి పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. అండర్ 16 క్రికెట్ పోటీలకు ఎంపికైన విద్యార్థిని శ్రీనిధి విద్యాసంస్థల కరస్పాండెంట్ అంజన బాబు ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు డైరెక్టర్ చందు పిఈటి ప్రవీణ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు అభినందించారు.
Share this on your social network: