విద్యార్థులు కష్టపడి చదువుకోవాలి ట్రైనీ ఐపీఎస్ కోట కిరణ్ కుమార్

Published: Friday December 02, 2022

మధిర డిసెంబర్ 1 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ట్రైనీ ఐపీఎస్ కిరణ్ కుమార్ కోరారు. మడుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు షేక్ నాగూర్ వలి అధ్యక్షతన గురువారం కోట కిరణ్ కుమార్ కి అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలన్నారు. ప్రస్తుతం మడుపల్లి పాఠశాలలో పనిచేస్తున్న బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయులు కోనా బాబురావు గతంలో తమ గ్రామమైన భీమవరం  ఉపాధ్యాయునిగా మెరుగైన సేవలందించారన్నారు. ఆయన కృషి ఫలితంగా నాలాంటి ఎంతోమంది ఉన్నత స్థానానికి చేరుకున్నారని ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన  కబడ్డీ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయ జట్టుకు ఎంపికైన పాఠశాల పదవ తరగతి విద్యార్థి పీట్ల గోపిని  అభినందించారు. ఈ కార్యక్రమంలో  ఉపాధ్యాయులు  కోన బాబురావు, తోట నరసింహారావు, వంకాయలపాటి వెంకటేశ్వరరావు, పైడిపల్లి కిషోర్, శీలం రామిరెడ్డి, యెహోషువ, జ్యోతిర్మయి, కారుమంచి కృష్ణయ్య బిమిని.రాణి, బొందిలి. చైతన్య, చాట్ల.చిట్టిబాబు,  సిబ్బంది నండ్రు.సూర్య ప్రకాష్ రావు, లూర్దు తదితరులున్నారు.