డెంగ్యూపై అవగాహన సదస్సు నిర్వహించిన ఏపీ ఓ రాంబాబు

Published: Friday August 20, 2021
మధిర, ఆగస్టు 19, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ ఈరోజు వెలుగు మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో డెంగ్యూ, సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సును స్థానిక మండల సమాఖ్య కార్యాలయంలో APM రాంబాబు బీరవల్లి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MPO రాజారావు, మాటూరుపేట డాక్టర్ వెంకటేశ్వరరావు డెంగ్యూ మరియు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి రేపటి నుండి అవగాహన కల్పించాలని, అందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా అవగాహన పెంచాలని అవగాహన కల్పిస్తూ కుటుంబ సభ్యులతోనే వారి ఇండ్లలో నిల్వ నీరు లేకుండా ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి హెల్త్ సూపర్ వైజర్స్ భాస్కర్ రావు, కొండయ్య, అన్ని గ్రామ సమాఖ్యల ఆదక్షురాళ్లు, CCలు, VOA లు హాజరైనారు.