ఘనంగా నిర్వహించిన మాజీ మంత్రి జన్మదిన వేడుకలు

Published: Wednesday June 09, 2021
వికారాబాద్ జూన్ 08 ప్రజాపాలన బ్యూరో : మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు తొడిగల సదానందరెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని కొత్తగడిలోని వృద్ధాశ్రమంలో నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం, 24వ వార్డులో మొక్కలు నాటడం, ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ, మీడియా మిత్రులకు బియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలను డాక్టర్ చంద్రప్రియ ఆధ్వర్యంలో నిర్వహించారు. వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు తొడిగల సదానందరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి బాటలు వేసి రాష్ట్ర సాధన కోసం నిర్విరామంగా కృషి చేశారన్నారు. ఏసిఆర్ లేని ఉద్యమాన్ని ఉహించుకోలేమన్నారు. పార్టీలకు, కులాలకు, వర్గాలకు అతీతంగా వికారాబాద్ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేసిన నాయకుడని కొనియాడారు. ఒకానొక సందర్భంలో ఏసిఆర్ ముఖ్యమంత్రిగా అవుతారు అనుకున్న సందర్భంలో కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ నుండి దూరం చేసినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే ఉన్నారన్నారు. రాబోవు రోజుల్లో ఏసిఆర్ నాయకత్వంలో వికారాబాద్ లో బీజేపీ జండా ఎగరవేయడం ఖాయం అని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాండు గౌడ్, జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, కార్యాలయ కార్యదర్శి ప్యాట శంకర్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, నరోత్తమ్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, 24వ వార్డ్ కౌన్సిలర్ శ్రీదేవిసదానంద రెడ్డి, శివరాజ్, శ్రీధర్ రెడ్డి, మహిళా మోర్చా నాయకులు  శృతి, సరిత, మాధవి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.