మృతుని కుటుంబానికి అండగా ఉంటాం ఎమ్మెల్యే ఫైళ్ల

Published: Wednesday November 24, 2021
యాదాద్రి నవంబర్ 23 వలిగొండ ప్రజాపాలన ప్రతినిది మండల పరిధిలోని వెల్వర్తి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు తక్కెళ్ల సంజీవ ఇటీవల అనారోగ్యానికి గురై సోమవారం రాత్రి మృతి చెందడంతో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి పాల్గొని సంజీవ మృతదేహంపై పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించి మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి అండగా ఉంటానని అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ సురకంటి వెంకటరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ పనుమటి మమత నరేందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి మొగుళ్ల శ్రీనివాస్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మామిల్ల రత్నయ్య, నాయకులు వెంకటరమణ, బూడిద పాపయ్య, ఎమ్మె లింగస్వామి, కల్కురి రాములు, ఎడవెళ్లి శాంతి కుమార్, కూచిమల్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.