స్మశానవాటికలో వసతులు కల్పించాలని ముదిరాజ్ సంఘం సభ్యులు ఎమ్మెల్యేకు వినతి
Published: Thursday June 30, 2022
మేడిపల్లి, జూన్29 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్లోని ముదిరాజ్ స్మశానవాటికలో మౌలిక వసతులు కల్పించాలని సంఘం సభ్యులు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి నివాసంలో ఆయనకు వినతి పత్రం సమర్పించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మహంకాళి నరసింహ ముదిరాజ్ , అరటికాయల భాస్కర్ ముదిరాజ్ ,బరంపేట రామరాజు ,ఈగ సంతోష్ ముదిరాజ్, కాయల చందు ముదిరాజ్ , తీగ దయాకర్, మంద చంద్రశేఖర్ ,అరటికాయల వంశీ, ముదిరాజ్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: