ఇలా చదువుపై ఆసక్తి పెరుగుతుంది

Published: Tuesday February 08, 2022
మండల విద్యాశాఖ అదికారి విజయ్ కుమార్
జన్నారం రూరల్ పిబ్రవరి 07 ప్రజాపాలన : ఆంగ్లా తెలుగు బోదనా పాఠశాలలో పుస్తక పఠనంలో విద్యార్థులకు చదువులపై అసక్షి పెరుగుతుందని మండల విద్యాశాఖ అధికారి విజయ్ కుమార్ అన్నారు, ఈ సందర్భంగా అయన సోమవారం మధ్యాహ్నం మాట్లాడుతూ జన్నారం మండలంలోని  పోన్కల్ ప్రాథమిక ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో  ప్రభుత్వ అదేశాల  మేరకు రీడ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు, విద్యార్థులలో అభ్యాసన శక్తిని నైపుణ్యాన్ని పంపేందుకు వందరోజుల పుస్తక పఠన కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు, పుస్తక పఠనంలో విద్యార్థులలో  చదువుపై ఆసక్తి పెరుగుతుందని అయన వివరించారు, ఈ కార్యక్రమంలో  కాంప్లెక్స్ ఎచ్ఎం కే, జనార్ధన్, పాఠశాల ఎచ్ఎం జాజాల శీనివాస్, ఉపాధ్యాయులు ప్రభాకర్, విమలా, పాఠశాల చైర్మన్ దాసరి రాజమౌళి, మధ్యాహ్నబోజనరాలు ఐలవేని లక్ష్మి, మ్యాకల రమ, విద్యార్థులు, అటెండర్, తదితరులు పాల్గొన్నారు.