ఇతర పార్టీల నుండి టీఆరెఎస్ లోకి చేరికలు... --ఆహ్వానించిన ఎమ్మేల్యే డా. సంజయ్

Published: Tuesday July 12, 2022

జగిత్యాల, జూలై, 11 ( ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండల దళిత మోర్చ అధ్యక్షులు చెలిమెల మల్లేశం, భాజపా సీనియర్ నాయకులు కోమురెల్లి రాజ్ కుమార్  మరియు ధావన్ పల్లి, రాయికల్ బీజేపీ యువత, కాంగ్రెస్ నాయకులు లోకేశ్వర్ జెడ్పీటీసీ అశ్విని జాదవ్ అధ్వర్యంలో ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్  సమక్షంలో పార్టీలో చేరగా టీఆరెఎస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించినారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీ ఎంపీ అరవింద్  రాయికల్ అభివృద్ధి లో వారి వైఖరి పట్ల మరియు టీఆరెఎస్ పార్టీ పథకాల పట్ల ఆకర్షితులై టీఆరెఎస్ పార్టీ లో యువత  చేరడం జరిగింది అని అన్నారు. రాయికల్ చిట్ట చివరి గ్రామం ధావన్ పల్లి లో నేడుడబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం, ఎండాకాలం లో కొండ చెరువు ఎండాకాలం లో జలకళ తోఉన్నదని, పెన్షన్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇలా అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిలో దేశంలో  దూసుకుపోతోందని అని, ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో  సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు కావట్లేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అశ్విని, మండల పార్టీ అధ్యక్షులు కొల శ్రీనివాస్, ఏఎంసి ఛైర్మెన్ రాజీ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తలారి రాజేష్, సర్పంచ్ యమున రవి, కౌన్సిలర్ శ్రీదర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కో ఆప్షన్ మహేంద్ర బాబు, నాయకులు సురేందర్ నాయక్, తిరుపతి, సుకేష్, తదితరులు పాల్గొన్నారు.