విద్యతోనే గిరి బిడ్డల వికాసం గురుకులల్లో కార్పొరేట్ విద్యకు దీటైన విద్య ప్రభుత్వం అందిస్త

Published: Tuesday November 29, 2022
(ప్రజా పాలన.)
 
భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్ సొసైటీ లీగ్ క్రీడలను ప్రారంభించిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం లోని కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్ మైదానం నందు సోమవారం నాడు భద్రాచలం ఐటీడీఏ  ఆధ్వర్యంలో నేటి నుంచి నాలుగు రోజులపాటు జరగనున్న రాష్ట్రస్థాయి  ఇంటర్ సొసైటీ లీగ్ క్రీడలను ముఖ్యఅతిథిగా హాజరై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు  ప్రారంభించారు. ముందుగా పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న తర్వాత విద్యార్థులు ఘన స్వాగతం పలికారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించి, ఉన్నత అధికారులు క్రీడాకారుల మార్చ్ ఫాస్ట్ ద్వారా గౌరవ వందనాన్ని స్వీకరించారు, అనంతరం జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు,
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  మాట్లాడుతూ విద్యతోనే గిరిజన బిడ్డలకు వికాసం కలుగుతున్నదని అన్నారు, ఇందుకోసం సీఎం కేసీఆర్ గారు రాష్ట్రంలో విద్య వైద్యానికి పెద్ద పీట వేశారని గుర్తు చేశారు, విద్య ఆవశ్యకతను గుర్తించిన సీఎం కేసీఆర్  రాష్ట్రంలో 1000కి పైగా గురుకులాలను ఏర్పాటు చేశారని, కార్పొరేటుకు దీటుగా నాణ్యమైన విద్యనందిస్తున్నారని గుర్తు చేశారు, విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, చదువుతోపాటు క్రీడాలలోనూ రాణించాలని సూచించారు, క్రీడలలో గెలుపు ఓటములు సహజమని అన్నారు, ఓటమిని కూడా స్ఫూర్తిగా తీసుకోవాలని చూశారు, ప్రభుత్వం కనిపిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని గిరిజన విద్యార్థులు ఉన్నత శిఖరాలను అవరోధించాలని ఆకాంక్షించారు, తెలంగాణలోని గిరిజన విద్యార్థుల ప్రగతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వనమా వెంకటేశ్వరరావు  ఖమ్మం జిల్లా  పార్టీ జిల్లా అధ్యక్షులు & ఎమ్మెల్సీ శ్రీ తాత మధు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ కోరం కనకయ్య , రాష్ట్ర ఉన్నత అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు,.