ఇంటింటికి తిరిగి చెక్కులు పంపిణీ చేసిన జడ్పీటీసీ దిరి శాల ప్రమీల

Published: Monday December 12, 2022
తల్లాడ, డిసెంబర్ 11 (ప్రజా పాలన న్యూస్)
తల్లాడ మండలంలో జడ్పిటిసి దిరిశాల ప్రమీల ఆదివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య హైదరాబాదులో ఉండటంతో ఆయన మంజూరు చేయించిన చెక్కులను ఎమ్మెల్యే సండ్ర ఆదేశాల మేరకు మండలానికి సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను జడ్పిటిసి దిరిశాల ప్రమీల చేతులమీదుగా పంపిణీ చేశారు. మండలంలోని కుర్ణవల్లి, కలకోడిమ, బసవపురం, రామానుజవరం, కేశవాపురం, లక్ష్మీపురం, ముద్దునూరు, తదితర గ్రామాల్లో ఆమె ఇంటింటికి తిరిగి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ చెక్కులను పంపిణీ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జోనల్ చైర్మన్ దిరిశాల దాసురావు, సర్పంచులు ఐలూరి లక్ష్మి, వనిగండ్ల అలేఖ్య, శీలం కోటారెడ్డి, ఎంపీటీసీలు రావూరి పద్మా, ఆదూరి వెంకటేశ్వర్లు, కురవల్లి సొసైటీ చైర్మన్ ఐలూరి ప్రదీప్ రెడ్డి,  ఎంపీటీసీలు, గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.