వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన సింగిల్ విండో చైర్మన్

Published: Friday December 03, 2021

కొడిమ్యాల డిసెంబర్ 02 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండల కేంద్రంతో పాటు నాచుపల్లి. రామకృష్ణాపూర్. కొండాపూర్ గ్రామాలలో సింగిల్ విండో ద్వారా నిర్వహించబడుతున్న పిఎసిఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొడిమ్యాల సింగిల్విండో చైర్మన్ సందర్శించారు. ఈ సందర్భంగా సింగిల్విండో చైర్మన్ రాజనర్సింగ రావు రైతులతో మాట్లాడారు. సాధ్యమైనంత తొందరగా తూకం వేసి తూకం వేసిన బస్తాలను రైస్ మిల్లులకు తరలించాలని అన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంట ఆయా గ్రామాల సర్పంచులు. సింగిల్విండో డైరెక్టర్లు. సీఈఓ గంగాధర్. రైతులు. పాల్గొన్నారు.