దిశా ఫౌండేషన్ అధ్వర్యంలో ప్రతిభా సేవా పురస్కారాలలో... --మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే డా సం

Published: Thursday August 25, 2022

జగిత్యాల, ఆగస్టు 24 (ప్రజాపాలన ప్రతినిధి): దిశా ఫౌండేషన్ అధ్వర్యంలో కరోనా క్లిష్ట పరిస్థితుల్లో విశిష్ట సేవలు అంత్య క్రియలు, ఫుడ్ డొనేషన్, బ్లడ్ డొనేషన్ 3 కేటగిరీలలో సేవలు  అందించిన వారికి ప్రతిభా సేవా పురస్కారాలు జగిత్యాల పట్టణ శుభ మస్తు ఫంక్షన్ హాల్ లో  సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ అందజేసినారు. జెడ్పీ చైర్మన్ వసంత మాట్లాడుతూ కరోనా సమయంలో విశిష్ట సేవలు అందించిన అందరికీ ప్రత్యేక అభినందనలు అని అన్నారు. ఎమ్మేల్యే డా. సంజయ్ మాట్లాడుతూ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా దైర్యంగా సేవలు అందించిన ప్రజా సేవకులకు అభినందనలు అని అన్నారు, ఎంతో మంది ప్రాణాలు కాపాడారని  పోలీస్, రెవెన్యూ, ఆశా మరియు ఆసుపత్రి సిబ్బంది, ఇతర సామాజిక సేవకులు అందరి కృషి వెలకట్ట లేనిది అని అన్నారు. మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్క విభాగం అందరూ ప్రభుత్వ ఆదేశం ప్రకారం కష్ట పడి పని చేశారని కొంత మంది ప్రైవేట్ వ్యక్తులు సైతం ప్రాణాలకు తెగించి సేవలు అందించారని వారు నిజంగా గొప్ప వారు అని ప్రతిభా పురస్కారం ద్వారా భవిష్యత్తులో మరింత సేవలు అందించడానికి ప్రోత్సాహ కరంగా ఉంటుందని, మీ సేవల ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి ఉపయోగ కరంగా ఉంటుందని, మంచి పనులు చేసే వారికి ప్రభుత్వం ఎల్లపుడూ అండగా ఉంటుంది అని, నిర్వాహకులు ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టడం అభి నందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో  డిసిఎంఎస్  ఛైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి, పిఎసిఎస్ ఛైర్మెన్ సుమన్ రావు, జడ్పిటిసి జలంధర్, బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జి రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.