జువ్వాడి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
Published: Wednesday May 11, 2022
మెట్ పల్లి, మే10 (ప్రజపాలన ప్రతినిధి): పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుగ్గారం నియోజకవర్గ మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు రెండవ వర్ధంతి సందర్భంగా, చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు నాయకులు ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో వారు చేసిన అభివృద్ధి పనులను, సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జెట్టి లింగం, అఫీస్, అందే మారుతి, పుల్ల రాజా గౌడ్, దుర్గం శేఖర్, ఎండి జబీర్, నర్సయ్య, రమేష్, సంతోష్ రెడ్డి, శ్రీధర్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Share this on your social network: