స్వాతంత్ర సమరయోధులు నెల్లూరి రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ నామ నాగేశ్వరరావు..

Published: Tuesday December 27, 2022
పాలేరు డిసెంబర్ 26 ( ప్రజా పాలన ప్రతినిధి)
నేలకొండపల్లి మండలంలోని చెన్నారం గ్రామంలో ఇటీవల మృతి చెందిన స్వాతంత్ర సమరయోధుడు నెల్లూరి రామయ్య, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామ నాగేశ్వరరావు, అనంతరం వారి కుటుంబ సభ్యులను  పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలు మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట పార్టీ నాయకులు. నల్లమల్ల వెంకటేశ్వరరావు, నెల్లూరి భద్రయ్య, దండా పుల్లయ్య, మంకెన వెంకటేశ్వరరావు, కడియాల శ్రీనివాసరావు, చింత నిప్పు సైదులు, తదితరులు పాల్గొన్నారు..