బహుమతులను అందజేసిన జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్

Published: Wednesday September 14, 2022
జన్నారం, సెప్టెంబర్ 13, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామం వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులతో పాటు బ్యాడ్జీలని జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్ మంగళవారం అందజేసినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
చిన్ననాటి నుంచి విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన చదువులను అలవర్చాలని అయన అన్నారు,  విద్యార్థి దశ నుంచి పిల్లలకు క్రమశిక్షణ దేశభక్తి అలవర్చాలన్నారు. మారుమూల గ్రామాలలో పాఠశాల ఏర్పాటు చేసి విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు మంచి విద్యనందిస్తున్న పాఠశాల యజమాన్యం తీరును అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అమరకోండ సతీష్ గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.