ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తున్న భట్టివిక్రమార్క చూసి భయపడుతున్న జిల్లా పరిషత్ చైర్మన్

Published: Monday March 28, 2022
మధిర మార్చి 27 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మండల కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూనువ్వు వెంట్రుకతో సమానం కాబట్టే మధిర ప్రజలు నిన్ను మూడుసార్లు ఓడించారు. మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మధిర మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ అధ్యక్షతన పత్రికా విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో సూరం శెట్టి కిశోర్ మాట్లాడు నియోజకవర్గంలో గడప గడపకు తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుని అవి అసెంబ్లీలో చర్చించి ఆ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చేస్తున్న స్థానిక శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్కకి వస్తున్న ప్రజాదరణ చూసి భయపడుతూ స్థాయి మరిచి నోటికి వచ్చిన విధంగా మాట్లాడటం ఆయన అసహనానికి తెలియజేస్తుంది. భట్టి గారు చేస్తున్న పాదయాత్ర, సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న చొరవ చూసి అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్, కె.టి.ఆర్. భట్టి విక్రమార్కకి విలువ ఇచ్చి మాట్లాడుతుంటే గల్లీ నాయకుడైన కమల్ రాజ్ నోటికొచ్చినట్లు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది.. నువ్వు వెంట్రుకతో సమానం కాబట్టే మధిర ప్రజలు నిన్ను మూడుసార్లు ఓడించారు. అహంకారం ఇలాగే ఉంటే నువ్వు జీవితం లో ఎప్పుడూ గెలవలేవు. కేంద్రం మీద వరి కోసం నువ్వు ధర్నాలు చేస్తున్నావ్ అవి ప్రజా సమస్యలు అయినప్పుడు భట్టి  చేసేవి ప్రజా సమస్యలపై కాదా. నీకు సిగ్గుందా నువ్వు ఒక నాయకుడు వేనా నీకు చేతనైతే మధిర నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడు. ప్రజల భట్టికి పడుతున్న బ్రహ్మరథం చూస్తుంటే నీకు మతి పోయినట్టుంది... ఇలా నోరు ఉందని మాట్లాడితే చూస్తూ ఊరుకోం.. ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.. అని అన్నారు ఈ పత్రికా సమావేశంలో మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిర్యాల వెంకటరమణ గుప్తా మధిర మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్ మధిర మండల గాంధీ పదం అధ్యక్షుడు బోడే పుడి గోపీనాథ్ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్ మాజీ సర్పంచులు కర్నాటి రామారావు, బొమ్మకంటి హరిబాబు ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ అలీ కాంగ్రెస్ నాయకులు ఆదిమూలం శ్రీనివాసరావు మొదలగు వారు పాల్గొన్నారు