గ్యాస్ సిలిండర్ ధరలను పెంచినందుకు నిరసనగా ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా

Published: Friday March 03, 2023
మేడిపల్లి, మార్చి2 (ప్రజాపాలన ప్రతినిధి)
 గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉప్పల్ చౌరస్తాలో
 స్థానిక ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి   ఆధ్వర్యంలో మాజీ ఎంబిసి చైర్మన్ తాడురి శ్రీనివాస్, చిలుకానగర్ డివిజన్  కార్పొరేటర్ బాన్నల గీతా ప్రవీణ్ ముదిరాజ్, ఉప్పల్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు వేముల సంతోష్ రెడ్డి, ఉప్పల్ నియోజక వర్గ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మహిళలతో కలిసి భారీ సంఖ్యలో  కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ధర్నా మరియు భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా  ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు అయిపోయిన వెంటనే గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ఆనవాయితీ అయిందని,ఒక పక్క పెరుగుతున్న సిలిండర్ ధరలు,పెట్రోల్ మరియు నిత్యావసరాల ధరలు పేద,మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని,కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఖండిస్తూ,పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. 
ఈ కార్యక్రమంలో  బీఆర్ఎస్ సీనియర్ నాయకులు  గరిక సుధాకర్, లేతాకుల రఘుపతి రెడ్డి, బాన్నల ప్రవీణ్ ముదిరాజ్, పల్లే నర్సింగరావు, డాక్టర్ బి. వి చారి, కాసం  మహిపాల్ రెడ్డి, మేకల మధుసూదన్ రెడ్డి, చింతల నరసింహారెడ్డి, పిట్టల నరేష్ ముదిరాజ్, కొంపల్లి రవీందర్, జగన్, కొండల్ రెడ్డి,మోహన్ రెడ్డి , సోమిరెడ్డి,  గొరెగే ఐలేష్, సోమసాని ప్రవీణ్ మసక సుధాకర్, వీరేష్ , నాయబ్ వెంకటేశ్వరరావు నోముల మైసయ్య సత్యపాల్ రెడ్డి,గుర్రాల వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీధర్, అరటికాయల వంశీ, పింజర్ల భరత్ రెడ్డి, చిలుకూరి శ్రీకాంత్, నరేందర్, గుండె రాజు, సురేష్  సల్ల శ్రీకాంత్ రెడ్డి,రాణి రెడ్డి, అనిత రెడ్డి హేమలత, జీనత్ బేగం, ఫాతిమా,శ్యామల నిర్మల, ప్రభావతి, హీన  , భాగ్య లక్ష్మి, ధన లక్ష్మి, భాగ్య రేఖ,ఉప్పల్ నియోజక వర్గ  డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు, అనుబంధ కమిటీల సభ్యులు,యువ నాయకులు మహిళ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.