షర్మిల సభ సందర్భంగా గోడపత్రికలు విడుదల

Published: Tuesday March 30, 2021
మధిర, మార్చి 29, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం సిరిపురం గ్రామంలో ఏప్రిల్ 9న ఖమ్మం లో జరిగే షర్మిలమ్మ సంకల్ప సభ సందర్భంగా రాష్ట్ర జిల్లా నాయకులు శీలం వెంకట్ రెడ్డి, సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  చావల చంద్రశేఖర్ ఆజాద్, ఎస్ నాగేశ్వరావు, శీలం చెన్నా రెడ్డి, పర్యవేక్షణలో సిరి పురం గ్రామం శాఖ ఆధ్వర్యంలో గోడపత్రిక ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు భరత్ విద్యాసంస్థల అధినేత వెంకట్ రెడ్డి, మాట్లాడుతూ ఏప్రిల్ 9న జరిగే షర్మిలమ్మ సంకల్ప సభ విజయవంతం చేయడానికి ప్రతి గ్రామం నుండి వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయ శ్రీమతి వైయస్ షర్మిల మను ఆశీర్వదించి మద్దతు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈరోజు రాష్ట్రంలో లో బంగారు తెలంగాణ అని చెప్పి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ గడీల పాలన సాగిస్తున్నారని ఈ పాలన అంతం అవ్వాలంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలని సంకల్పంతో తెలంగాణ కోడలు షర్మిలమ్మ నాయకత్వాన్ని కచ్చితంగా అందరూ బలపరిచే స్వామి ఆసన్నమైందని దీనికి ప్రతి ఒక్కరు భుజం భుజం కలిపి షర్మిలకు మద్దతుగా ఏప్రిల్ 9న జరిగే సభకు వేలాదిగా తరలి రావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో యస్ నాగేశ్వరావు సేలం చెన్నారెడ్డి గారు ఐలూరు మహేశ్వర్ రెడ్డి గారు వెదురు కృష్ణారెడ్డి గారు దేవపట్ల శ్రీనివాస శాస్త్రి ఎస్.కె మస్తాన్ భాష  దుంప  ఉద్దండు రెడ్డి ఇ నాగ వేణు జేవీ రెడ్డి ఇ ambrose తోక కార్తీక గోపి మర్యాదా స్ మణిగా నరసింహారావు ఎండపల్లి కోటయ్య తదితరులు పాల్గొన్నారు