విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను ధ్వంసం చేసిన దుండగులు

Published: Tuesday November 16, 2021

బోనకల్, నవంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి: బోనకల్ మండల పరిధిలోని రావినూతల గ్రామం నుండి నారాయణపురం వెళ్లే డొంక రోడ్డు లో గల మూడవత్ కోటియా పొలం వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి ట్రాన్స్ఫార్మర్ లో ఉన్న ఆయిల్ మరియు విద్యుత్ వైర్లను దొంగిలించినారు. ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం చేసిన పిదప ముడావత్ కోటియ విద్యుత్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయగా వారు వచ్చి పరిశీలించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అనంతరం పోలీసు వారు వచ్చి పరిశీలించి పంచనామా చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బోనకల్ ఎస్ఐ తేజావత్ కవిత, ఏ ఎస్ ఐ దొండపాటి వెంకటనారాయణ, హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.